News June 28, 2024
జరుగుమల్లి: డీసీఈబి కార్యదర్శిగా శ్రీనివాసరావు
ప్రకాశం జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శిగా జరుగుమల్లి జడ్పీ పాఠశాల హెచ్ఎం ఎం.శ్రీనివాసరావును నియమిస్తూ డీఈవో సుభద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆస్థానంలో ఉన్న ఉప్పలపాడు పాఠశాల హెచ్ఎం వెంకట్రావును రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో జరిగే అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలు తన అధీనంలో ఉంటాయని తెలిపారు.
Similar News
News October 7, 2024
అద్దంకి: ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి
అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ప్రజా వేదికకు తరలివచ్చిన ప్రజలతో మంత్రి మమేకమై వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. సత్వరమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
News October 7, 2024
త్వరపడండి.. ఆలోచిస్తే.. ఆశాభంగం: ఎమ్మెల్యే తాటిపర్తి
ఇసుక ధరలపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘త్వరపడండి.. ఆలోచిస్తే.. ఆశాభంగం. యర్రగొండపాలెం నియోజకవర్గంలో చంద్రబాబు ఉచిత ఇసుక ధర (18 టన్నులు) రూ.43,200 మాత్రమే. షరతులు వర్తిస్తాయి,’ అంటూ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారాలోకేశ్లను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ ఉచిత ఇసుక అనేది బూటకపు మాటలని ఆదివారం పేర్కొన్నారు.
News October 7, 2024
ప్రకాశం జిల్లాకు మూడో స్థానం
నెల్లూరులో రెండు రోజులుగా జరుగుతున్న ఆట్యా పాట్యా 9వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఆటలు పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు మూడో స్థానాన్ని సాధించింది. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను పలువురు అభినందించారు. ప్రకాశం జిల్లా జట్లు మూడో స్థానాన్ని సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆట్యా పాట్యా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నంబూరి శ్రీనివాసులు అన్నారు. భవిష్యత్తులో కూడా మంచి పథకాలు సాధించాలని కోరారు.