News June 28, 2024
ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే.. కానీ: MP శశిథరూర్

ఐదు దశాబ్దాల క్రితం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే కానీ రాజ్యంగ విరుద్ధం కాదన్నారు కాంగ్రెస్ MP శశిథరూర్. ‘ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్ష నేతల అరెస్టులు, మీడియాపై ఆంక్షలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే. అయితే రాజ్యాంగ విరుద్ధం మాత్రం కాదు’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఎమర్జెన్సీ అంశాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని, రాష్ట్రపతి, స్పీకర్ లోక్సభలో ప్రస్తావించడంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే.
Similar News
News December 31, 2025
గోదావరిలో దూకబోయిన తల్లి, కూతురు.. కాపాడిన పోలీసులు

కొవ్వూరు గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యకు యత్నించిన తల్లి, పదేళ్ల కుమార్తెను శక్తి టీం పోలీసులు బుధవారం కాపాడారు. 112 నంబర్ నుంచి అందిన సమాచారంతో తక్షణమే స్పందించిన పోలీసులు వారిని రక్షించారు. కుటుంబ కలహాల వల్లే ఈ అఘాయిత్యానికి సిద్ధపడినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.
News December 31, 2025
2026 రిపబ్లిక్ పరేడ్.. చరిత్రలో తొలిసారి యానిమల్ కంటింజెంట్

2026 రిపబ్లిక్ డే పరేడ్లో కొత్తగా యానిమల్ కంటింజెంట్ ప్రదర్శన జరగనుంది. సైన్యంలోని రీమౌంట్ & వెటర్నరీ కార్ప్స్లో శిక్షణ తీసుకున్న జంతువులు కవాతు చేయనున్నాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో బార్డర్ల వెంబడి భద్రతకు ఉపయోగించే 2 బాక్ట్రియన్ ఒంటెలు, 4 రాప్టార్లు, 10ఇండియన్ బ్రీడ్ ఆర్మీ, 6 కన్వెన్షనల్ మిలిటరీ డాగ్స్ ప్రదర్శనలో పాల్గొంటాయి. లద్దాక్కు చెందిన జన్స్కార్ పోనీలు కవాతు చేయనున్నాయి.
News December 31, 2025
ఏంటీ AGR రచ్చ? వొడాఫోన్ ఐడియాకు కేంద్రం ఇచ్చిన ఊరట ఇదే!

వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన ₹87,695 కోట్ల AGR బకాయిలను ఫ్రీజ్ చేస్తూ కేంద్రం భారీ ఊరటనిచ్చింది. AGR అనేది టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు. తమకు కేవలం ఫోన్ కాల్స్, డేటా ద్వారా వచ్చే ఆదాయంపైనే ఫీజు వేయాలని కంపెనీలు వాదించగా.. అద్దెలు, డివిడెండ్లు సహా ఇతర ఆదాయాలను కూడా కలపాలని ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికే మద్దతు తెలపడంతో కంపెనీలపై ₹వేల కోట్ల అదనపు భారం పడింది.


