News June 28, 2024

ట్రైన్‌లో ఒకరి అజాగ్రత్త వల్ల నిండు ప్రాణం బలి!

image

ట్రైన్‌లో ఓ వ్యక్తి అజాగ్రత్తగా ఉండటం వల్ల తోటి ప్రయాణికుడు మరణించాడు. ఎర్నాకులం-హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లో కేరళకు చెందిన అలీఖాన్ స్నేహితుడితో కలిసి ఆగ్రాకు వెళ్తున్నాడు. ఆయన దిగువ బెర్త్‌లో పడుకోగా మిడిల్ బెర్త్‌లో ఉన్న వ్యక్తి సీటు చైన్లు సరిగా బిగించలేదు. దీంతో పై బెర్త్ ఆయనపై పడిపోయింది. తీవ్ర గాయాలైన అలీఖాన్‌ HYDలోని రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

Similar News

News September 20, 2024

నన్ను కావాలనే ఇరికించారు: జానీ మాస్టర్

image

లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్‌గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

News September 20, 2024

లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు: ఏఆర్ డెయిరీ

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ స్పందించింది. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వెల్లడించింది. ఇదే విషయాన్ని టీటీడీకి వివరించినట్లు చెప్పింది. జులైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని వెల్లడించింది.

News September 20, 2024

ఉప్పరపల్లి కోర్టుకు జానీ

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి జానీని పోలీసులు విచారించారు.