News June 28, 2024

NDA ప్రభుత్వ అవినీతికి ఈ ఘటనలే నిదర్శనం: ఖర్గే

image

పదేళ్ల NDA పాలనలో అవినీతి, నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా నాసిరకం పనులతో మౌలిక వనరులకు నష్టం కలుగుతోందని INC చీఫ్ ఖర్గే విమర్శించారు. ‘ఢిల్లీ విమానాశ్రయ పైకప్పు, జబల్‌పూర్ ఎయిర్‌పోర్టు రూఫ్ కూలిపోయాయి. అయోధ్యలో కొత్త రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రామ మందిరం లీకేజీ అవుతోంది. బిహార్‌లో 13 బ్రిడ్జిలు కూలిపోయాయి. గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలి ఘోర విషాదం సంభవించింది’ అని Xలో ఫైరయ్యారు.

Similar News

News September 20, 2024

లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ: నేడే తొలి మ్యాచ్

image

మాజీ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఇవాళ్టి నుంచి జరగనుంది. నేడు తొలి మ్యాచులో రాత్రి 7 గంటలకు కోణార్క్ సూర్యాస్, మణిపాల్ టైగర్స్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ధవన్, ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ తదితర మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, ఫ్యాన్ కోడ్ యాప్‌లో ఈ మ్యాచులను చూడవచ్చు.

News September 20, 2024

ఆయుధాలు వదిలేసి సరెండర్ కండి: అమిత్ షా

image

నక్సల్స్ హింసను విడనాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలేసి సరెండర్ కావాలని సూచించారు. తన ప్రతిపాదనను పట్టించుకోకపోతే నక్సల్స్‌పై ఆలౌట్ ఆపరేషన్ మొదలుపెడతామని అమిత్ షా హెచ్చరించారు.

News September 20, 2024

భారత్ 376 పరుగులకు ఆలౌట్

image

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్ అయ్యింది. అశ్విన్(113), జడేజా(86), జైస్వాల్(56) రాణించడంతో భారత్ 376 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మూద్ 5, టస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశారు.