News June 28, 2024
సిరిసిల్ల: మొన్న ప్రియుడు.. ఈరోజు ప్రియురాలు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719564769435-normal-WIFI.webp)
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. కాగా మొన్న ప్రియుడు.. ఈ రోజు ప్రియురాలు చనిపోయింది. గూడెం గ్రామానికి చెందిన <<13504961>>చందు<<>>, భాగ్యలక్ష్మి కరీంనగర్లోని ఓ పార్కులో ఈ నెల 24న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రియుడు అక్కడే చనిపోగా.. ప్రియురాలు ఎల్లారెడ్డిపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News July 3, 2024
KNR: బీరు సీసాతో హత్యాయత్నం.. ఐదుగురిపై కేసు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719974262403-normal-WIFI.webp)
హత్యాయత్నం కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు చిగురుమామిడి SI రాజేష్ తెలిపారు. సైదాపూర్(M) దుద్దెనపల్లికి చెందిన శ్రీనివాస్ స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం రాత్రి సుందరగిరి బస్టాండ్లో వేచి ఉన్నాడు. ఈ క్రమంలో సుందరగిరికి చెందిన అఖిల్, అజయ్, వేణు, నాగరాజు, సుమిత్లు శ్రీనివాసును బీర్ సీసాతో హత్య చేయబోగా తప్పించుకున్నాడు. శ్రీనివాస్ ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేశారు.
News July 3, 2024
పెద్దపల్లి: బాలికపై వృద్ధుడు అత్యాచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719968250668-normal-WIFI.webp)
ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక స్థానికంగా ఉన్న సామాజిక మరుగుదొడ్డిలోకి వెళ్లిన సమయంలో దుర్గయ్య(65) అత్యాచారయత్నం చేశాడు. గమనించిన గ్రామస్థులు వృద్ధునికి దేహశుద్ధి చేసి బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత చట్టంలో భాగంగా పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News July 3, 2024
రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలి: C&MD
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719931723636-normal-WIFI.webp)
ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సంస్థ C&MD బలరాం సూచించారు. HYD సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల డైరెక్టర్లు, GMలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షా కాలం వల్ల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల భద్రతపై మరింత దృష్టి సారించాలన్నారు.