News June 28, 2024
శ్రీకాకుళం: పీజీ సెట్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల హవా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719573835855-normal-WIFI.webp)
రాష్ట్రస్థాయిలో జరిగిన పీజీ సెట్ పరీక్షలో ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ డా.ఎన్ ఎస్ ఎన్ స్వామి శుక్రవారం తెలిపారు. హిస్టరీ విభాగంలో జే నవీన్కు 19వ ర్యాంకు, వాణిజ్య శాస్త్ర విభాగంలో కే రసజ్ఞకు 24వ ర్యాంకు, రాజనీతి శాస్త్రంలో బి సంతోష్ కు 99వ ర్యాంకు వచ్చాయన్నారు. వారికి అభినందనలు తెలుపుతూ ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చేరాలని కోరారు.
Similar News
News July 5, 2024
శ్రీకాకుళం: నేటితో ముగుస్తున్న ఫీజు చెల్లింపు గడువు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720170463987-normal-WIFI.webp)
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ డిగ్రీ చివరి ఏడాది 5వ సెమిస్టర్ ఇన్స్టంట్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్ 29 నుంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఈ పరీక్షకు అర్హులైన జాబితాను ఆయా కళాశాలలకు అధికారులు అందజేశారు. ఇంకా చెల్లించని విద్యార్థులు నేడు సాయంత్రం లోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
News July 5, 2024
శ్రీకాకుళం: అధికారులు అంకిత భావంతో పనిచేయాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720169676712-normal-WIFI.webp)
అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతీ లబ్ధిదారునికి అందించే దిశగా అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
News July 5, 2024
శ్రీకాకుళం: 8 నుంచి ఎయిర్ఫోర్స్కు దరఖాస్తులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720163739132-normal-WIFI.webp)
అగ్నివీర్, అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పని చేయుటకు ఆసక్తి ఉన్న వారు ఈనెల 8 నుంచి 28వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధి అధికారి శుక్రవారం తెలిపారు. అవివాహిత యువత ఇంటర్ లేదా 10వ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వివరాలకు https://agnipathvayu.cdac.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.