News June 28, 2024

కేసీఆర్‌తో కార్యకర్తల భేటీకి 3 రోజులు బ్రేక్

image

TG: కేసీఆర్ గత 15 రోజులుగా ఎర్రవెల్లిలో నిరంతరాయంగా పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతున్నారని బీఆర్ఎస్ తెలిపింది. ఆయనతో ప్రజల ఆత్మీయ సమావేశాలకు శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజుల పాటు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. పార్టీ నేతలతో కీలక సమావేశాలున్న నేపథ్యంలో పార్టీ నుంచి మరో ప్రకటన వచ్చే వరకూ ఎవరూ తనను కలవడానికి రావొద్దని కేసీఆర్ కోరారని పేర్కొంది.

Similar News

News September 16, 2025

భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త

image

AP: తనను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను తీర్చాడు భర్త. ఎన్టీఆర్(D) రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ భార్య ఏడాది క్రితం డెంగీతో మరణించారు. ఇటీవల ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్‌(బయాలజీ)గా DSCలో ఎంపికయ్యారు. ఆమె చివరి కోరికను తీర్చడానికి రోజుకు 10 గంటలకు పైగా చదివినట్లు రామకృష్ణ తెలిపారు. తన భార్య బతికి ఉంటే సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

News September 16, 2025

వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ

image

AP: వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కోర్టు తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.

News September 16, 2025

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

image

TG: రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, భువనగిరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.