News June 29, 2024
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719575331573-normal-WIFI.webp)
ప్రజావాణి, ధరణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా సమస్యలకు పరిష్కరం దొరుకుతుందన్నారు. శుక్రవారం ఆయన చందంపేట తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 266 ఫిర్యాదులు స్వీకరించినట్లు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News July 3, 2024
కొత్త చట్టాలతో బాధితులకు న్యాయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719969114595-normal-WIFI.webp)
దేశవ్యాప్తంగా జులై 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. తొలి రోజు కొత్త చట్టాల కింద జిల్లాలో ఏడు ఎఫ్ఐఆర్లను నమోదయ్యాయని తెలిపారు. బాధితుడు ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ – మెయిల్ ఇతర సామాజిక మాధ్యమాలు వేటి ద్వారానైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
News July 3, 2024
NLG: రెండు రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719926552578-normal-WIFI.webp)
ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాలలో బుధ, గురువారాలు రెండు రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఈ విషయమై జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఆదేశించారు.
News July 2, 2024
మంత్రి కోమటిరెడ్డికి కంచర్ల కౌంటర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719919821388-normal-WIFI.webp)
<<13545889>>మంత్రి కోమటిరెడ్డికి <<>>మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రి బీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండలో రూ.100 కోట్లు పలికే భూమి ఉందా అని ఆయన ప్రశ్నించారు. మిగతా పార్టీ ఆఫీసులకు భూమి కేటాయించినట్లే బీఆర్ఎస్కి భూ కేటాయింపు జరిగిందన్నారు. పార్టీ ఆఫీసుకు సీసీఎల్ఏ అనుమతులు కూడా వచ్చాయన్నారు. నిబంధనల ప్రకారం డబ్బు కూడా చెల్లించామన్నారు.