News June 29, 2024
శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719600492955-normal-WIFI.webp)
సైబర్ స్కామ్కు పాల్డడ్డారనే ఆరోపణలతో 137 మంది భారతీయులను శ్రీలంక అరెస్ట్ చేసింది. కొలంబోలోని మడివేలా, బత్తరముల్లా, నెగొంబా ప్రాంతాల్లో వీరందరిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు బెట్టింగ్, జూదం, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయ్, అఫ్గానిస్థాన్లోనూ వీరు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.
Similar News
News July 3, 2024
పవిత్రమైన ఆశయంతో అమరావతిని ప్రారంభించాం: CM చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720002631719-normal-WIFI.webp)
AP: అమరావతి నిర్మాణాన్ని ఓ పవిత్రమైన ఆశయంతో ప్రారంభించామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ల్యాండ్ ఇవ్వడానికి జనం ముందుకొచ్చారు. కానీ వారికి డబ్బులెలా ఇవ్వాలి? అప్పుడే ల్యాండ్ పూలింగ్ ఐడియా వచ్చింది. అమరావతి ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాండ్ పూలింగ్. ప్రపంచ బ్యాంకు దీన్ని ఓ కేస్ స్టడీగా ప్రజెంట్ చేసింది. భూములు ఇచ్చిన రైతులకు ఏడాది రూ. 10వేలు ఇవ్వాలని నిర్ణయించాం’ అని గుర్తుచేసుకున్నారు.
News July 3, 2024
నంబర్ వన్ ఆల్రౌండర్గా హార్దిక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720001612999-normal-WIFI.webp)
ICC T20 ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అగ్రస్థానానికి దూసుకెళ్లారు. 222 పాయింట్లతో ఆయన టాప్ ప్లేస్కు చేరారు. ఆ తర్వాత వనిందు హసరంగ, స్టోయినిస్, సికందర్ రజా, షకీబ్ ఉన్నారు. బ్యాటర్ల విభాగంలో ఆసీస్ ఓపెనర్ హెడ్ టాప్లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. బౌలర్ల విభాగంలో అన్రిచ్ నోర్ట్జే తొలి స్థానంలో ఉండగా, అక్షర్ పటేల్ ఎనిమిదో ప్లేస్లో ఉన్నారు.
News July 3, 2024
రైతు ఆత్మహత్య వెనుక ఎవరున్నా ఉపేక్షించం: భట్టి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1717866339174-normal-WIFI.webp)
TG: ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని ప్రెస్మీట్లో స్పష్టం చేశారు. ఇక త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని భట్టి వెల్లడించారు. గత ఐదేళ్లలో కనీసం రూ.లక్ష కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు తమను ప్రశ్నించడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు.