News June 29, 2024
డైట్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్: ప్రిన్సిపల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719588549681-normal-WIFI.webp)
డైట్లో డిప్లమో కోర్స్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్కు ఈనెల 30 నుంచి జూలై 4 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని భీమిలి డైట్ ప్రిన్సిపాల్ ఎం.జ్యోతి కుమారి తెలిపారు. మొదటి విడత వెబ్ఆప్షన్స్ ఇవ్వనివారు, మొదటి విడతలో సీటు రానివారు.. ఈ అవకాశం వినియోగించుకోవచ్చని చెప్పారు. వీరికి జూలై 5 నుంచి ఏడో తేదీ వరకు సీట్లు కేటాయింపు ఉంటుందని, జూలై 9 నుంచి 13 వరకు ప్రవేశాలు కల్పిస్తామని జ్యోతికుమారి తెలిపారు.
Similar News
News July 3, 2024
విశాఖలో ఉల్లి కోసం క్యూ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719973793443-normal-WIFI.webp)
రైతు బజార్లో ఉల్లిపాయలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు క్యూ కడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు టమాటాకు భారీగా డిమాండ్ ఏర్పడడం వల్ల 80 రూపాయల వరకు ధర పలికింది, దీంతో వినియోగదారులు క్యూ కట్టారు. తాజాగా ఉల్లిపాయల ధర కేజీ రూ.36కు చేరుకుంది. రైతు బజార్లో తగినంత సరుకు కూడా లేకపోవడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో వినియోగదారులు క్యూలో నిల్చొని ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్నారు.
News July 3, 2024
భారత్-బంగ్లాదేశ్ స్నేహబంధం బలోపేతం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719961380401-normal-WIFI.webp)
భారత్- బంగ్లాదేశ్ నౌకా దళాల మధ్య జరుగుతున్న విన్యాసాలతో రెండు దేశాల మధ్య స్నేహబంధం బలోపేతం కానుందని మంగళవారం విశాఖలో నేవీ అధికారులు తెలిపారు. భారత్ తరఫున హాజరైన ‘ఐఎన్ఎస్ రణవీర్’ యుద్ధనౌక కమాండింగ్ అధికారి(సీవో)కి బంగ్లాదేశ్ నేవీ అధికారులు రియర్ అడ్మిరల్ ఖొండ్కర్ మిస్బా ఉల్ అజీమ్, రియర్ అడ్మిరల్ ఎస్. ఎం. మోనిరుజ్జామన్లు వేర్వేరు జ్ఞాపికలు అందించారు.
News July 3, 2024
విశాఖ పోర్ట్ మొదటి స్థానంలో నిలవడానికి కారణం ఇదే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719964230933-normal-WIFI.webp)
భారత్ నుంచి 132 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు తెలిపారు. ఇందులో ప్రధాన దిగుమతిదారులుగా అమెరికా, చైనా నిలిచినట్లు పేర్కొన్నారు. ఎగుమతుల్లో రొయ్యలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. విశాఖ పోర్ట్ మొదటి స్థానంలో నిలవడానికి ఆక్వా కల్చర్ పరిశ్రమ ప్రధాన కారణమని అన్నారు. వనామీ రొయ్యలు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.