News June 29, 2024

చంద్రబాబును కలిసిన TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

image

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Similar News

News July 3, 2024

సత్తెనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

మండలంలోని వెన్నదేవి గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సత్తెనపల్లికి మండలం కట్టవారిపాలెం గ్రామానికి చెందిన గొట్టిముక్కల వెంకట రామిరెడ్డి హైదరాబాదు నుంచి స్వగ్రామానికి వస్తుండగా, వెన్నాదేవి వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట రామారెడ్డి (55) మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

News July 3, 2024

బాపట్ల: వృద్ధురాలిపై వృద్దుడి అసభ్య ప్రవర్తన

image

వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ వృద్ధురాలు మంగళవారం బాపట్ల గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు తన పట్ల అదే గ్రామానికి చెందిన ఇంటి పక్క వీధిలో ఉండే 70 ఏళ్ల వరికూటి సీతారామయ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గ్రామీణ సీఐ శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 3, 2024

బాపట్ల: సముద్రంలో బోటు బోల్తా.. మత్స్యకారుడి మృతి

image

సముద్రంలో వేటకు వెళ్లి బోటు బోల్తా పడి మత్స్యకారుడు మృతి చెందినట్లు బాపట్ల రూరల్ సీఐ శ్రీహరి తెలిపారు. బాపట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన కుర్రు కిరణ్ అనే వ్యక్తి సముద్రంలో వేటకు వెళ్లి, అలల తాకిడికి బోటు బోల్తాపడి వలకు చిక్కుకొని మృతి చెందినట్లు మృతుడి తండ్రి తెలిపారన్నారు. మృతుడు తండ్రి అగ్గులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.