News June 29, 2024
ఆగని వలసలతో గులాబీలో గుబులు..?
TG: BRS MLAలు వరుసగా కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో గులాబీ దళంలో గుబులు రేపుతోంది. ఫామ్ హౌస్లో KCRతో మీవెంటే ఉంటాం అని చెప్పి.. అంతలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో ఇప్పుడు పార్టీలో ఉండేది ఎవరు? పోయేది ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు BRSకు గుడ్ బై చెప్పగా త్వరలోనే మరో ఐదుగురు చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్పై నమ్మకంతోనే వీరందరూ కాంగ్రెస్లో చేరుతున్నట్లు టాక్.
Similar News
News July 3, 2024
విద్యార్థులకు గుడ్న్యూస్
TG: రాష్ట్రంలోని ప్రతి స్కూలుకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్టాప్లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్టాప్లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
News July 3, 2024
ఫొటో తీసి రూ.20వేలు గెలిచే ఛాన్స్!
AUG19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తోంది. మహాలక్ష్మీ, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి వంటి పథకాలతో పాటు ఉత్తమ వార్తా చిత్రం(న్యూస్ క్లిప్) విభాగాల్లో ఫొటోలు తీయాలి. మొదటి ముగ్గురికి రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, తర్వాత ఐదుగురికి ప్రోత్సాహకంగా రూ.5వేలు ఇస్తుంది. ఫొటోలను adphoto.ts@gmail.coకి పంపాలి. మరిన్ని వివరాలకు 9949351523కి ఫోన్ చేయవచ్చు.
News July 3, 2024
రాహుల్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాలి: మోదీ
అగ్నివీర్, మైనార్టీ తదితర అంశాలను రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చి లోక్సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. రాహుల్ వ్యాఖ్యలను పిల్లల ప్రవర్తన అని చెప్పి తేలికగా తీసుకోవద్దని స్పీకర్ ఓం బిర్లాను కోరాను. హిందువులను ఎగతాళి చేయడం ఫ్యాషన్గా మారిపోయిందన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి సీనియర్ నేతలున్నా అరాచక, అబద్ధాల మార్గంలో వెళ్లాలనుకోవడం ఆందోళనకరమన్నారు.