News June 29, 2024
ఏలూరు: విషాదం.. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

కైకలూరు మండలం ఉప్పుటేరు చెక్ పోస్ట్ సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కైకలూరు మండలం గుమ్మళ్లపాడుకు చెందిన యాళ్ల దేవరాజు(45) ద్విచక్ర వాహనంపై ఆకివీడు నుంచి స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో ఉప్పుటేరు వద్ద వెనక నుంచి లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో దేవరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 20, 2026
ఉండిలో జంట మృతదేహాల కలకలం

ఉండిలో జంట మృతదేహాల లభ్యం కావడం కలకలం రేపుతోంది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో సుబ్బారావు అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, మంగళవారం నిమ్మలపేటలో విజయ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వరుసగా రెండు మృతదేహాలు బయటపడటంతో ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.
News January 20, 2026
కూల్ డ్రింక్ తాగిన బాలుడి మృతి.. UPDATE

<<18903335>>ఎలుకల మందు కలిపిన కూల్ డ్రింక్<<>> తాగిన భీమవరం బలుసుమూడి ఉండే మాన్యం మహారుద్ర కాంత్ అనే బాలుడు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు భీమవరం వన్ టౌన్ SI రామారావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి నుంచి వలస వచ్చిన సుబ్బారావు కుటుంబం భీమవరంలో అద్దెకు ఉంటోంది.
News January 19, 2026
ప.గో: హీరో నవీన్ పోలిశెట్టి సందడి

ఉమ్మడి ప.గో. జిల్లా ఏలూరులో ఆదివారం ‘అనగనగా ఒక రాజు’ మూవీ టీమ్ సందడి చేసింది. చిత్రం విజయోత్సవ సంబరాల్లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షీ చౌదరి ఏలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా పడమర వీధి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సినిమా ప్రదర్శన అవుతున్న థియేటర్కు వెళ్లి ప్రేక్షకులతో కాసేపు సరదాగా గడిపారు.


