News June 29, 2024

డీఎస్ మృతి పట్ల సీఎంల సంతాపం

image

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్ కీలక పాత్ర పోషించారని రేవంత్ అన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. డి.శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని, ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

Similar News

News January 25, 2026

Super 5: మీ ప్లేట్‌లో ఉండాల్సిన టాప్ వెజ్జీస్

image

ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తినడం చాలా ముఖ్యం. ఈ 5 వెజ్జీస్ మీ డైట్‌లో ఉంటే అదిరిపోయే హెల్త్ మీ సొంతమని న్యూట్రిషనిస్ట్ లోవ్నీత్ బాత్రా అంటున్నారు. రక్తం పెరగడానికి పాలకూర (Iron), కంటి చూపు కోసం క్యారెట్ (Vitamin A), రోగనిరోధక శక్తికి రెడ్ క్యాప్సికమ్ (Vitamin C) బాగా పనిచేస్తాయి. అలాగే బీట్‌రూట్ ద్వారా Folate, అరుగుదల పెంచేందుకు కాలీఫ్లవర్ నుంచి డైటరీ ఫైబర్ అందుతాయి.

News January 25, 2026

ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ!

image

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఫిబ్రవరి 14న బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 18 నుంచి 21 రోజులు సభ నిర్వహించాలని భావిస్తోంది. మార్చి రెండో వారం వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అదే రోజు శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది.

News January 25, 2026

982 మంది పోలీసులకు అవార్డులు

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విధుల్లో మెరుగైన పనితీరు కనబరిచినందుకు 982 మంది పోలీసులను ఉన్నతస్థాయి అవార్డులు వరించాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది, హోంగార్డులకు గ్యాలెంటరీ, సర్వీస్ మెడల్స్, పలువురిని రాష్ట్రపతి అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. 982లో 125 గ్యాలెంటరీ, 101 ప్రెసిడెంట్, 756 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ఉన్నాయి.