News June 29, 2024

ఉమ్మడి ప.గో డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

బి.సి, ఎస్.సి, ఎస్.టికి సంబంధించి ఉమ్మడి ప.గో జిల్లాలోని డి.ఎస్.సి.అభ్యర్థులకు వచ్చే నెల 11వ తేదీ నుంచి డి.ఎస్.సి. ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా బి.సి సంక్షేమ అధికారిణి నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బి.సి స్టడీ సర్కిల్ కార్యాలయంలో జులై 8వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
➠ SHARE IT..

Similar News

News September 21, 2024

కోడలిపై భద్రాచలం ప్రధాన అర్చకుడి లైంగిక వేధింపులు ..ప.గో లో కేసు

image

కోడలిని లైంగిక వేధింపులకు గురిచేసిన భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు, ఆయన దత్త పుత్రుడిపై వేటు పడిన విషయం తెలిసిందే. కోడలు తెలిపిన వివరాలు..’పెళ్లైనప్పటి నుంచే వేధించేవాడు. ఇంట్లో వారికి చెప్పినా పట్టించుకోలేదు. ఆయన పోలికలతో మగ బిడ్డ కావాలని బలవంతం చేసేవాడు’. అదే సమయంలో కట్నం కోసం వేధించడంతో తాడేపల్లిగూడెం పోలీసులను ఆశ్రయించింది. వారికోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

News September 21, 2024

ఏలూరు: బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ జారీ

image

ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్లలంక గ్రామానికి చెందిన ఘంటసాల రాణి శుక్రవారం ఏలూరు డీఎస్పీ శ్రావణ కుమార్‌ను ఆశ్రయించింది. తాను చనిపోయినట్లు చూపించి 70 సెంట్లు భూమిని భలే హానొక్ పేరుపై మార్చారని ఆరోపించింది. రాణి చనిపోయినట్టుగా 2012లో డెత్ సర్టిఫికెట్‌పై సాక్షి సంతకాలు పెట్టిన ఘంటసాల నాగార్జున, సైదు వీరయ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News September 21, 2024

ఏలూరు మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు

image

రైల్వే లైన్ల పునరుద్ధరణ పనుల కారణంగా ఏలూరు మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29న తిరుపతి- విశాఖపట్నం, 30న విశాఖపట్నం- తిరుపతి, విజయవాడ- విశాఖపట్నం, విశాఖపట్నం-గుంటూరు, రాజమహేంద్రవరం – విశాఖపట్నం, అలాగే అక్టోబర్ 1న విశాఖపట్నం- గుంటూరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.