News June 29, 2024
KMM: ‘సాగుబడి.. ఇక ఇదే ఒరవడి’

ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తృతపరచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని ఓ రైతు వేదికలో మాత్రమే అవగాహన కార్యక్రమాలు జరిగేవి. ఐతే ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో 16, భద్రాద్రి జిల్లాలో 13 కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు క్లస్టర్ల వారీగా రైతు వేదికలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Similar News
News September 13, 2025
ఖమ్మం: పత్తి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ ఆదేశాలు

ఖమ్మం జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధరతో కొనుగోళ్లు జరగాలని అ.కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2,25,613 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 27,07,356 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. జిల్లాలో 5సిసిఐ కేంద్రాలు, 9 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.
News September 12, 2025
రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధిపై సమీక్ష

ఖమ్మం జిల్లాలోని వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధిపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సమీక్ష నిర్వహించారు. వెల్ఫేర్ అధికారులతో ఆమె శుక్రవారం సమావేశమయ్యారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య, సౌకర్యాల కల్పనపై సమగ్రంగా చర్చించారు. పాఠశాలల పనితీరును బలోపేతం చేయాలని, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె ఆదేశించారు.
News September 12, 2025
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి: ప్రధాన న్యాయమూర్తి

ఖమ్మం జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రాజగోపాల్ తెలిపారు. ‘రాజీ మార్గమే రాజమార్గం’అని పేర్కొన్నారు. రాజీపడదగిన కేసులలో కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవడానికి ఇది ఒక ఉత్తమ అవకాశం అని ఆయన చెప్పారు.