News June 29, 2024
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారికి ముఖ్య సూచన

వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, అన్ని శాఖల అధికారులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30లోపు రావొద్దని EO కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు. ఉదయం 11.45- మధ్యాహ్నం 12.45 వరకు మహా నైవేద్యం జరుగుతుందని, అందువలన ఈ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30లోపు, మినహా మిగతా సమయాల్లో దర్శనానికి రావాలన్నారు.
Similar News
News December 30, 2025
నిబంధనలు పాటించాలి: ఎస్పీ విద్యాసాగర్

కృష్ణా జిల్లా ప్రజలకు ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026ను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో అశాంతి, మద్యం తాగి, ర్యాష్ డ్రైవింగ్, డీజేలు, చట్టవిరుద్ధ కార్యక్రమాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసు తనిఖీలు, పికెట్లు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.
News December 30, 2025
పరిశ్రమల స్థాపనే లక్ష్యం: కలెక్టర్ బాలాజీ

పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు పొందిన యూనిట్ల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కానూరులో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, సాధ్యమైన వాటిని తక్షణమే పరిష్కరించారు. పరిశ్రమలకు ప్రభుత్వ రాయితీలు సకాలంలో అందించి పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు.
News December 30, 2025
REWIND 2025: కృష్ణా జిల్లా ఖ్యాతిని చాటిన ప్రతిభా విజయాలు

* కృష్ణాజిల్లా పరిషత్కు ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా అవార్డు
* ఉయ్యూరు మండలం ముదునూరుకి చెందిన పాలడుగు శివకి గద్దర్ అవార్డు
* USA 2025 కిరీటం దగ్గించుకున్న గుడివాడ వాసి మౌనిక అట్లూరి
* కూచిపూడిలో జరిగిన యోగాకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం
* ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యాపకులకు జాతీయస్థాయి అవార్డులు


