News June 29, 2024
44 వేల ఏళ్లనాటి తోడేలు మృతదేహంపై పరీక్షలు!

రష్యాలో 44 వేల ఏళ్ల క్రితం నాటి తోడేలు మృతదేహాన్ని శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. ఆ కాలంలో ఈ తోడేలు ఆహారం, జీవనశైలి వంటి అంశాలపై స్టడీ చేస్తున్నారు. కాగా 2021లో యాకుషియా ప్రాంతంలో దట్టమైన మంచులో ఈ తోడేలు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇక్కడ -64 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే ఈ తోడేలు మృతదేహం ఇప్పటికీ పాడవకుండా ఉంది. ఇది మంచు తుఫానులో చిక్కుకుని ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.
Similar News
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<
News September 18, 2025
త్వరలో US టారిఫ్స్ ఎత్తివేసే ఛాన్స్: CEA

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.