News June 29, 2024
ఇవాళ్టి గోల్డ్ రేట్స్
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేట్ రూ.120 పెరిగి రూ.72,280గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.100 పెరిగి రూ.66,250కి చేరింది. అటు కేజీ వెండి ధర రూ.94,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News September 21, 2024
సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు: జూ.ఎన్టీఆర్
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్కు సినీ హీరో Jr.NTR కృతజ్ఞతలు తెలిపారు. ‘దేవర’ సినిమా టికెట్ల ధర పెంపునకు అనుమతినిస్తూ జీవో జారీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినిమాకు మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.
News September 21, 2024
యువీ ఆ రోజు ఏడు సిక్సులు కొట్టి ఉండేవారు: బ్రాడ్
2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో యువరాజ్ సింగ్ 6 సిక్సులు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ రోజు అంపైర్ కారణంగా యువీ ఏడో సిక్స్ మిస్ అయిందని బ్రాడ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆ ఓవర్ రీప్లే నేను మళ్లీ ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక్క విషయం ఒప్పుకోవాలి. అంపైర్ చూడకపోవడం వల్ల ఆ ఓవర్లో ఓ నోబాల్ వేసినా తప్పించుకున్నాను. లేదంటే యూవీ 7 సిక్సులు కొట్టేసి ఉండేవారు’ అని వ్యాఖ్యానించారు.
News September 21, 2024
ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికలపై పోరాడాలి: సీఎం రేవంత్
TG: సీతారాం ఏచూరిని కోల్పోవడం సమాజానికి తీరని నష్టం అని సీఎం రేవంత్ అన్నారు. HYDలో జరిగిన ఏచూరి సంస్మరణ సభలో మాట్లాడుతూ ‘జమిలి ఎన్నికల ముసుగులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర చేస్తోంది. దేశాన్ని కబళించాలని చూస్తోంది. సీతారాం ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికల అంశంపై పోరాడాలి. ఈ సమయంలో ఆయన లేకపోవడం దేశానికి నష్టం’ అని వ్యాఖ్యానించారు.