News June 29, 2024
జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు కర్నూల్ యువకుడు
జులై మూడో వారంలో విజయవాడలో జరగనున్న జాతీయ స్థాయి అండర్-10 ఆర్చరీ పోటీలకు కర్నూల్ నగరానికి చెందిన యువకుడు కె.పార్థ చంద్ర ఎంపికైనట్లు జిల్లా ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి నాగరత్నమయ్య తెలిపారు. పార్థ చంద్ర ఈ నెల 22 నుంచి 24 వరకు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో 9వ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని వివరించారు.
Similar News
News October 6, 2024
చిన్న చెరువులో మృతదేహం లభ్యం
అవుకు రిజర్వాయర్ సమీపంలోని చిన్న చెరువులో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా నీటి ప్రవాహానికి మృతదేహం కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కూళ్లిపోయి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 6, 2024
రేపటి నుంచి యూనివర్సిటీలకు దసరా సెలవులు
కర్నూలు జిల్లాలోని యూనివర్సిటీలకు దసరా సెలవులు ప్రకటించారు. రాయలసీమ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలకు ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లు డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ వీ.లోకనాథ తెలిపారు. 14వ తేదీ తిరిగి పునఃప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు.
News October 6, 2024
రహదారులను వేగవంతంగా పూర్తి చేయండి: కలెక్టర్
నేషనల్ హైవే రహదారులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నేషనల్ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్హెచ్ 40 భూ సేకరణకు సంబంధించిన నష్ట పరిహారం వెంటనే పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్హెచ్ 340సీకి సంబంధించి బీ.తాండ్రపాడు నుంచి గార్గేయపురం వరకు ఔటర్ రింగ్ రోడ్డు పనులను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలన్నారు.