News June 29, 2024
ప్రధాని మోదీకి వివాహ ఆహ్వానం అందించిన వరలక్ష్మి
నటి వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచ్దేవ్ల వివాహం జులై 2న థాయ్లాండ్లో జరగనుంది. ఈక్రమంలో వరలక్ష్మి పలువురు సెలబ్రిటీలను స్వయంగా కలిసి చెన్నైలో జరిగే రిసెప్షన్కి ఆహ్వానిస్తున్నారు. తాజాగా తండ్రి శరత్ కుమార్, రాధికతోపాటు కాబోయే దంపతులు ప్రధాని మోదీని కలిశారు. రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు అందించి ఆయనను ఆహ్వానించారు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ తమకు టైమ్ ఇచ్చినందుకు ఆమె మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News September 21, 2024
లంచ్: భారత్ ఆధిక్యం 432 రన్స్
బంగ్లాదేశ్తో తొలి టెస్టులో భారత్ 432 రన్స్ ఆధిక్యం సాధించింది. మూడో రోజు లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. క్రీజులో గిల్(86), పంత్(82) ఉన్నారు. వీరిద్దరూ 138 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లా బౌలర్లు లంచ్ వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 376, బంగ్లా 149 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
News September 21, 2024
ఎల్లుండి అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, ఇవాళ మరో ఆవర్తనం ఏర్పడనుందని IMD వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదలి ఎల్లుండి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు విస్తారంగా వానలు కురుస్తాయంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు ఈవారంలోనే దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు.
News September 21, 2024
వెయ్యి రన్స్ కొట్టిన ఓల్డెస్ట్ కెప్టెన్గా రోహిత్
కెప్టెన్ రోహిత్శర్మ బంగ్లాదేశ్తో టెస్టులో(5, 6రన్స్) రాణించలేకపోయినా ఒక రికార్డు నమోదు చేశారు. ఓ క్యాలెండర్ ఇయర్లో వెయ్యికిపైగా రన్స్ చేసిన ఓల్డెస్ట్ భారత కెప్టెన్గా నిలిచారు. 37Y రోహిత్ 2024లో 3 వన్డేలు(157), 11 T20లు(378), 7 టెస్టుల్లో(466) మొత్తం 1,001 రన్స్ చేశారు. ఈ ఏడాది టాప్ స్కోరర్లుగా శ్రీలంక క్రికెటర్లు నిస్సాంక, కుశాల్ మెండిస్, 3లో జైస్వాల్, 4లో కమిందు మెండిస్, 5లో రోహిత్ ఉన్నారు.