News June 29, 2024

అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం 1,575 ఎకరాలు

image

AP: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 1,575 ఎకరాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండరాజుపాలెం గ్రామాల్లో భూములను గుర్తించింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్‌ను నిర్మించనుంది. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం మొదలవగా, మిగతా వాటిపై ప్రభుత్వం దృష్టిసారించనుంది.

Similar News

News October 11, 2024

అప్పుడే బంధాలు మెరుగుపడతాయి.. కెన‌డాకు తేల్చిచెప్పిన భార‌త్‌

image

భార‌త వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన, ధ్రువీకరించదగిన చ‌ర్య‌లు తీసుకున్న‌ప్పుడే కెన‌డాతో బంధాలు మెరుగుపడతాయని భార‌త్ స్పష్టం చేసింది. భార‌త్‌-ఆసియ‌న్ శిఖ‌రాగ్ర స‌ద‌స్సు సంద‌ర్భంగా PM మోదీని క‌లిసి వాస్త‌విక స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్టు కెన‌డా PM ట్రూడో పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ ఇరు దేశాధినేత‌ల మ‌ధ్య ఎలాంటి అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేద‌ని పేర్కొనడం గమనార్హం.

News October 11, 2024

నోయల్ టాటా చరిత్ర ఘనం

image

1957లో జ‌న్మించిన నోయల్ టాటా UKలో విద్యాభ్యాసం చేశారు. 2000 ప్రారంభ ద‌శ‌కంలో టాటా గ్రూప్‌లో చేరి వ్యాపార సామ్రాజ్య విస్తరణలో కీలకపాత్ర పోషించారు. 1998లో ఒక స్టోర్ ఉన్న ట్రెంట్ రిటైల్‌ను సంస్థ MDగా 700 స్టోర్ల‌కు విస్త‌రించారు. $500M విలువగల టాటా ఇంట‌ర్నేష‌న‌ల్‌ను $3 బిలియ‌న్లకు తీసుకెళ్లారు. టాటా ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా ఆయ‌న ర‌త‌న్ టాటా ట్ర‌స్ట్‌, దొరాబ్జీ ట్ర‌స్టుల విధుల‌ను ప‌ర్య‌వేక్షిస్తారు.

News October 11, 2024

ట్రంప్ ఎన్నికల ప్రకటనల్లో తెలుగు కూడా!

image

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారతీయుల్ని ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో భారత్‌పై ఆయన ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల ప్రచార ప్రకటనల్ని కూడా భారతీయ భాషల్లోనే ఇస్తున్నారు. ముఖ్యంగా తమిళ, తెలుగు ప్రకటనలు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. ‘సంస్కృతి-సన్మార్గం, దేశానికి ఆధారం. Vote Republican’ అంటూ పలు పోస్టర్లలో కనిపిస్తోంది.