News June 29, 2024

అయోధ్య రోడ్లు జలమయం.. ఆరుగురు ఉద్యోగుల సస్పెండ్

image

యూపీలోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన 14KM రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు జలమయం అయ్యింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. మురుగు కాలువల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Similar News

News September 21, 2024

నటి జెత్వానీ కేసు.. నేడు విజయవాడకు విద్యాసాగర్ తరలింపు

image

AP: ముంబై నటి జెత్వానీని వేధించిన కేసులో అరెస్టయిన కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు నేడు విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న డెహ్రాడూన్‌లో అతడిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు, ముందుగా అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై ఇవాళ విజయవాడకు తీసుకురానున్నారు.

News September 21, 2024

డిగ్రీ కోర్సులను మార్చుకోవాలనుకుంటున్నారా?

image

TG: డిగ్రీ కోర్సులను మార్చుకునేందుకు విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించారు. దోస్త్ కౌన్సెలింగ్‌లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే డిగ్రీ సీట్లు భర్తీ చేశారు. ఈనెల 21 నుంచి 23 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుంటే 24న కొత్త కోర్సుల కేటాయింపు జాబితాను ప్రకటించనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 21, 2024

ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్

image

AP: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.