News June 29, 2024
డీఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719655018910-normal-WIFI.webp)
గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ ధర్మపురి శ్రీనివాస్ పార్థివదేహానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా డీఎస్ సేవలను డిప్యూటీ సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Similar News
News July 8, 2024
ఆదాయం దండిగా వస్తున్నా.. ఇంకా అద్దె భవనాల్లోనే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720420166154-normal-WIFI.webp)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి ప్రతినెల పెద్ద మొత్తంలో ఆదాయం అందించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు సొంత స్థలాలు ఉన్నా ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సొంత భవనాలు సమకూరుతాయని, ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
News July 8, 2024
ఖమ్మం మార్కెట్లో పెరిగిన మిర్చి ధర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720410973396-normal-WIFI.webp)
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,550 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.2050 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.
News July 8, 2024
మూడు పంచాయతీలుగా భద్రాచలం పంచాయతీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720415083711-normal-WIFI.webp)
భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపించిన బిల్లుపై గవర్నర్ రాధాకృష్ణన్ సంతకం చేశారు. బూర్గంపాడు మండలంలోని సారపాకను రెండు పంచాయతీలుగా ఆమోదించారు. ఇన్నాళ్లూ రెండు ప్రాంతాలు మున్సిపాలిటీగా మారతాయని పట్టణవాసులు భావించారు. కానీ భద్రాచలం పట్టణాన్ని భద్రాచలం, సీతారామనగర్, శాంతినగర్ పంచాయతీలుగా, సారపాకను సారపాక, ఐటీసీ గ్రామ పంచాయతీలుగా విభజించారు.