News June 29, 2024

బీజేపీకి ప్రజలే సమాధానం చెప్తారు: హేమంత్ సోరెన్

image

ఈ ఏడాది చివర్లో జరిగే ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి తగిన సమాధానం చెప్తారని మాజీ CM <<13524683>>హేమంత్<<>> సోరెన్ అన్నారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో తనను బీజేపీ అరెస్ట్ చేయించిందని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన అరెస్టు ఆదివాసీలు, పేదవారు, రైతులను అణచివేయడమేనని తెలిపారు. మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టే విషయమై తర్వాత ఆలోచన చేస్తానన్నారు.

Similar News

News September 21, 2024

డిగ్రీ కోర్సులను మార్చుకోవాలనుకుంటున్నారా?

image

TG: డిగ్రీ కోర్సులను మార్చుకునేందుకు విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించారు. దోస్త్ కౌన్సెలింగ్‌లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే డిగ్రీ సీట్లు భర్తీ చేశారు. ఈనెల 21 నుంచి 23 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుంటే 24న కొత్త కోర్సుల కేటాయింపు జాబితాను ప్రకటించనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 21, 2024

ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్

image

AP: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.

News September 21, 2024

రాష్ట్రంలో పరువు హత్య

image

AP: అన్యమతస్థుడిని పెళ్లి చేసుకున్న కూతురిని పేరెంట్స్ హతమార్చిన ఘటన నెల్లూరు(D) పద్మనాభునిసత్రంలో జరిగింది. రమణయ్య, దేవసేనమ్మల చిన్నకూతురు శ్రావణి(24) భర్తతో విడిపోయింది. ఇటీవల రబ్బానీ బాషాను పెళ్లిచేసుకోగా తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు ఆమెను ఇంటికి తీసుకొచ్చి కొట్టడంతో చనిపోయింది. దీంతో ఇంటిపక్కనే పూడ్చిపెట్టారు. 25 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేశారు.