News June 29, 2024
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం: డా.మాలతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719670158616-normal-WIFI.webp)
వర్షాకాలం వ్యాధులు వ్యాపించే సమయం ఆసన్నమైందని , జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళికలు తయారుచేసి అమలు చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.మాలతి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో రాఫిడ్ యాక్షన్ టీమ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో మందుల కొరత లేదని అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Similar News
News July 18, 2024
దమ్మపేట: పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721290915625-normal-WIFI.webp)
పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన దమ్మపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. దమ్మపేట మండలం జమేధారు బంజర్ గ్రామంలో ఇద్దరు చిన్నారులు పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 18, 2024
ఎన్నికల హామీని తూచా తప్పకుండా నెరవేరుస్తాం: ఎంపీ రేణుక చౌదరి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721289961121-normal-WIFI.webp)
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల అధ్యక్షతన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ రేణుక చౌదరి మాట్లాడుతూ.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన రాష్ట్రంలోని ప్రతీ రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీని అధికారంలోకి వచ్చిన 7 నెలలలోనే ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు.
News July 18, 2024
కొత్తగూడెం: గ్రూప్-1 మెయిన్స్కు ఫ్రీ కోచింగ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721284897208-normal-WIFI.webp)
తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఉచిత కోచింగ్ను అందిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. అర్హులైన మైనారిటీ అభ్యర్థులు ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.