News June 29, 2024
T20WC ఫైనల్: సౌతాఫ్రికా టార్గెట్ 177 రన్స్
T20WC ఫైనల్లో భారత్ 20 ఓవర్లలో 176/7 స్కోర్ చేసింది. కోహ్లీ 59 బంతుల్లో 76(6 ఫోర్లు, 2 సిక్సులు), అక్షర్ 31 బంతుల్లో 47(4 సిక్సులు, ఒక ఫోర్) పరుగులతో అదరగొట్టారు. శివమ్ దూబే 27, రోహిత్ 9, సూర్య 3, పంత్ 0, హార్దిక్ 5*, జడేజా 2 రన్స్ చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, నోర్ట్జే చెరో 2 వికెట్లు, రబడ, జాన్సెన్ చెరో వికెట్ పడగొట్టారు. విజయం కోసం దక్షిణాఫ్రికా 177 రన్స్ చేయాలి.
Similar News
News September 20, 2024
కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ: జగన్
AP: చంద్రబాబు అనే వ్యక్తి దుర్మార్గుడని YS జగన్ ధ్వజమెత్తారు. ‘దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగాలనే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. 100 రోజుల చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారమంతా ఓ కట్టు కథ. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు’ అని జగన్ మండిపడ్డారు.
News September 20, 2024
తిరుమల ఆలయ ప్రతిష్ఠను కాపాడాలి: టీటీడీ ఈఓ
AP: తిరుమల ఆలయ ప్రతిష్ఠను భక్తులు, ప్రజలు కాపాడాలని టీటీడీ ఈఓ శ్యామలరావు కోరారు. శ్రీవారి లడ్డూ వివాదంపై ఈఓ స్పందించారు. ‘రికార్డుల్లో లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని వాడాలని ఉంది. నెయ్యి నాణ్యతను పరీక్షించే పరికరాలను గుజరాత్లోని ఎన్డీడీబీ విరాళంగా ఇచ్చింది. వాటితోనే నెయ్యి నాణ్యతను పరీక్షిస్తున్నాం. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
News September 20, 2024
జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి AR డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు NDDB రిపోర్టు తేల్చిందని TTD EO శ్యామలరావు ప్రకటించారు. నెయ్యిపై అనుమానంతో జులై 6న 2 ట్యాంకర్లను ల్యాబ్కు పంపితే నాణ్యత లేదని తేలిందన్నారు. తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామన్నారు. వెంటనే AR డెయిరీ నెయ్యిని వాడటం ఆపేశామన్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామన్నారు.