News June 29, 2024
కాటంరాజు ఏలిన మా కనిగిరి చరిత్ర తెలుసా?
కనిగిరిని 13వ శతాబ్దంలో కాటంరాజు ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కనిగిరి దుర్గాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించాడు. నాడు ఈ ప్రాంతాన్ని బంగారుకొండ అని కూడా పిలిచేవారు. ఆయన ఏలుబడిలో కడప, కర్నూల్ ప్రాంతాలు కూడా ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆయన పాలనలో కనిగిరి ప్రాంతంలో కరవు ఏర్పడటంతో నెల్లూరు పాలకుడైన మనుమసిద్ధి రాజుతో ఓప్పందం కుదుర్చుకున్నారని చరిత్ర.
Similar News
News October 8, 2024
రాచర్ల: టానిక్ అనుకొని పేలు మందు తాగి వ్యక్తి మృతి
టానిక్ అనుకొని పేలు మందు తాగి వృద్ధుడు మృతి చెందిన ఘటన రాచర్ల మండలంలో జరిగింది. ఆకివీడుకు చెందిన వెంకటయ్యకు ఆరోగ్యం సరిగాలేదు. ఆ నేపథ్యంలో అతను ..మందులు వాడుతూ ఉంటాడు. కాగా శనివారం గొర్రెలకు పేలు చంపే మందు, టానిక్ ఒకే చోట ఉన్నాయి. సరిగ్గా చూపులేని ఆయన పేలు మంది తాగేసి, అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆసుపత్రికి తరలించగా సోమవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
News October 8, 2024
ప్రకాశం: కేజీబీవీల్లో 52 నాన్ టీచింగ్ పోస్టులు
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ 52 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు డీఈఓ డి.సుభద్ర తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18న తుది జాబితా తయారు చేస్తామని, 21న జిల్లా కమిటీ ఆమోదం తర్వాత 22న ఆప్కాస్ ఛైర్మన్కు జాబితాను సమర్పిస్తామని అన్నారు.
News October 7, 2024
మార్టూరులో విమానాశ్రయానికి ప్రతిపాదన: MLA ఏలూరి
మార్టూరులో విమానాశ్రయం, చినగంజాం మోటుపల్లిలో నౌకాశ్రయానికి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టినట్లు పర్చూరు MLA ఏలూరు సాంబశివరావు తెలిపారు. విజన్ 2047రాష్ట్రా అభివృద్ధిలో భాగంగా.. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరగబోయే సమావేశంలో ఈ ప్రతిపాదనలు ఉంచనున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తులో పలు మౌలిక వసతుల కల్పనకు ఈ డాక్యుమెంటరీ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు.