News June 30, 2024
పాలమూరులో 74,905 ఎకరాల్లో పంటల సాగు

ఈ వానాకాలంలో జున్ మొదటి వారంలోనే కురిసిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. సీజన్ ప్రారంభమై 24 రోజులు అయినా వానలు పడకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ వానాకాలంలో 3,23,533 ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో అక్కడక్కడా కురిసిన వర్గాలకు 40 శాతం మేర అంటే 74,905 ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Similar News
News March 11, 2025
మహబూబ్నగర్: అందరికీ సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే యెన్నం

అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ధర్మాపూర్ గ్రామంలో రూ.40 లక్షలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తున్నామని తెలిపారు.
News March 11, 2025
MBNR: సైబర్ మోసాలతో జర జాగ్రత్త..!

ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్లో ఓ గ్రూప్లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
News March 11, 2025
MBNR: మూడా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మూడా కార్యాలయంలో మూడా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, పర్ణిక రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముడా అధికారులపై పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.