News June 30, 2024
అతిసార వ్యాధి నిర్మూలనకు నీటి సరఫరా కీలకం: JC

అతిసార వ్యాధి నిర్మూలనకు పరిశుభ్రత, నాణ్యమైన నీటి సరఫరాలే కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం అతిసార వ్యాధి నిర్మూలన ప్రచార కార్యక్రమం- 2024 పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, విద్య, ఐసిడిఎస్, మునిసిపల్ అధికారులు ఉన్నారు.
Similar News
News January 9, 2026
కడప జిల్లాలో 81,345 విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు

కడప జిల్లాలో 81,345 విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. కడప డివిజన్లో 23,250, మైదుకూరులో 14,305, ప్రొద్దుటూరులో 30,304, పులివెందులలో 13,486 సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. స్మార్ట్ మీటర్లు విద్యుత్ వినియోగాన్ని పారదర్శకంగా చూపిస్తాయని ఎస్ఈ రమణ తెలిపారు. బిల్లులు ఆటోమేటిక్గా రూపొందుతాయన్నారు. విద్యుత్ పొదుపు, ఖర్చు తగ్గింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
News January 9, 2026
YVU: బీఈడీ, ఎంఈడీ పరీక్షా ఫలితాలు విడుదల

YVU బీఈడీ, ఎంఈడీ పరీక్షా ఫలితాలను వర్సిటీ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ శుక్రవారం విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ.. సెప్టెంబరులో పరీక్షలు జరిగాయన్నారు. ఫలితాలు సకాలంలో విడుదల చేశామన్నారు. విద్యార్థులు ఫలితాల కోసం వైవీయూ వెబ్సైట్ https://www.yvuexams.in/results.aspx ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. పద్మ, సీఈ ప్రొ. కృష్ణారావు పాల్గొన్నారు.
News January 9, 2026
20 సూత్రాల సమావేశానికి ప్రొద్దుటూరు MLA ఒక్కరే.!

కడపలోని 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంక దినకర్ అధ్యక్షతన శుక్రవారం కడపలో అభివృద్ధి సమావేశం జరిగింది. కాగా ఉమ్మడి కడప జిల్లాలో పదిమంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కీలకమైన ఈ సమావేశానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఒక్కరే హాజరయ్యారు. తన నియోజకవర్గంలోని సమస్యలపై ఆయన సమావేశంలో లేవనెత్తారు. వైసీపీ, జనసేనకు MLAలు ఉన్నా, వారెవ్వరూ సమావేశానికి హాజరుకాలేదు.


