News June 30, 2024
ఫించన్ల పంపిణీపై కలెక్టర్లతో వీసీ నిర్వహించిన నీరభ్ కుమార్
రాష్ట్రంలో జులై 1వ తేదీన ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఫించన్ల పంపిణీపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జులై 1వ తేదీన 65,18,496 మందికి వివిధ ఫించన్ దారులకు పెన్షన్ అందిస్తామన్నారు.
Similar News
News September 20, 2024
అడుసుమిల్లి మృతిపై జగన్ దిగ్భ్రాంతి
మాజీ ఎమ్మెల్యే, రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి జయప్రకాశ్ మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జై ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని జగన్ గుర్తు చేసుకున్నారు. జయప్రకాశ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
News September 20, 2024
విజయవాడకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్..!
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో శుక్రవారం అరెస్టయిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పోలీసులు శనివారం విజయవాడకు తీసుకురానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం డెహ్రాడూన్లోని మూడో అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో విద్యాసాగర్ను ఏపీ పోలీసులు ప్రవేశపెట్టినట్లు తాజాగా సమాచారం వెలువడింది. డెహ్రాడూన్లో అరెస్టయిన విద్యాసాగర్ను ట్రాన్సిట్ వారెంట్పై పోలీసులు విజయవాడకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
News September 20, 2024
విజయవాడ: బెయిల్ కోసం కాంతిరాణా టాటా పిటిషన్
సస్పెన్షన్లో ఉన్న IPS అధికారి కాంతిరాణా టాటా ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్ను హైకోర్టు సోమవారం విచారణ జరపనున్నట్లు సమాచారం. కాగా కాదంబరి జెత్వాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం కాంతి రాణా టాటాను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.