News June 30, 2024
HYD: బ్రీత్ అనలైజర్ను ఎత్తుకెళ్లిన వాహనదారుడు

తనిఖీలు చేపడుతున్న పోలీసుల వద్ద నుంచి ఓ వాహనదారుడు బ్రీత్ అనలైజర్ ఎత్తుకెళ్లిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. బోయిన్పల్లి పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బ్రీత్ అనలైజర్ పట్టుకుని వేగంగా పారిపోయాడు. పోలీసులు విచారణ జరిపి నిందితుడి ఆచూకీ కోసం, చోరీకి గురైన సామగ్రిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Similar News
News January 8, 2026
రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్-2 మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్

నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమిని కాజేయాలనుకున్న వ్యక్తులకు సహకరించిన రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2 కె.మధుసూధన్ రెడ్డిని రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సస్పెండ్ చేశారు. అంతే కాదు.. మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దీన్ని సీరియస్గా తీసుకున్నారు.
News January 6, 2026
రంగారెడ్డిలో ‘పేదోడి విందు’ కొండెక్కింది

పేదోడి విందైన చికెన్ ధర కొండెక్కడంతో RRజిల్లాలో చికెన్ ప్రియులకు షాక్ తగిలి బెంబేలు ఎత్తుతున్నారు. న్యూ ఇయర్ ప్రారంభంలోనే కిలో చికెన్ ధర త్రిబుల్ సెంచరీకి చేరింది. గత కొన్ని రోజులుగా రూ.200- 250 ఉన్న ధర అమాంతం పెరగడంతో వచ్చే పండుగ ఎలా చేసుకోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఫారం ధర రూ.180 పలుకుతోంది. వినియోగం పెరిగి, కోళ్ల పెంపకం తగ్గడమే ధర పెరగుదలకు కారణమని ఫారం యజమానులు చెబుతున్నారు.
News January 5, 2026
మొయినాబాద్: 8 నెలలుగా మ్యాథ్య్ టీచర్ లేక 10th విద్యార్థుల ఆందోళన

మొయినాబాద్లోని హిమాయత్నగర్ ప్రభుత్వ పాఠశాలలో 8 నెలలుగా గణిత బోధించకపోవడంతో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు భయపడుతున్నారు. సిలబస్ పూర్తి కాకుండానే 10వ పబ్లిక్ పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోజు హిమాయత్నగర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బురకాయల రమేశ్ 10వ తరగతి విద్యార్థులను సందర్శించి, MEOతో మాట్లాడి ఉపాధ్యాయుని నియమిస్తానని హామీ ఇచ్చారు.


