News June 30, 2024

1 నుంచి 8 తరగతుల ఉమ్మడి పరీక్ష రద్దు

image

APలో ఎలిమెంటరీ(1-8వ తరగతి) విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణ విధానాన్ని హైకోర్టు రద్దు చేసింది. ‘సాల్ట్ పేరుతో 2022లో తెచ్చిన ఈ విధానం చట్ట విరుద్ధం. కామన్ పేపర్, రోజులో 2 పరీక్షలు, నిర్దేశిత టైం టేబుల్ 10వ తరగతి బోర్డు పరీక్షల్ని పోలి ఉన్నాయి. ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు ఏ విద్యార్థీ బోర్డు పరీక్షలో పాస్ కావాల్సిన అవసరం లేదు. అలాగే ఇది ప్రైవేట్ స్కూళ్లకు వర్తించదు’ అని కోర్టు పేర్కొంది.

Similar News

News December 31, 2025

యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు

image

హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యూట్యూబర్ అన్వేష్‌(నా అన్వేషణ)పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. అంతకుముందు వైజాగ్‌లోనూ అన్వేష్‌పై <<18701726>>ఫిర్యాదు<<>> చేసిన సంగతి తెలిసిందే. అటు ఆయన ద్రౌపదిని ఉద్దేశించి RAPE అంటూ పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

News December 31, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.320 తగ్గి రూ.1,35,880కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 పతనమై రూ.1,24,550 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 31, 2025

అయామ్ సెమనీ కోడికి ఎందుకు అంత ధర?

image

అయామ్ సెమనీ కోడి ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కనిపిస్తుంది. ఈ కోడి చర్మం, మాంసం, ఎముకలు, అవయవాలు, ఈకలు అన్నీ నలుపే. రక్తం ముదురు ఎరుపుగా ఉంటుంది. గుడ్లు మాత్రం బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, జన్యు మార్పుల వల్ల సెమనీ కోళ్లకు ఈ రంగు వచ్చింది. ఇండోనేషియా ప్రజలు ఈ కోడిని పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నదిగా నమ్ముతారు. ఈ సెంటిమెంట్ వల్లే ఈ కోడి ధర కిలో రూ.2 లక్షలకు పైనే ఉంటుంది.