News June 30, 2024
జగ్గయ్యపేటలో విద్యుత్ షాక్కి గురై వ్యక్తి మృతి
మండలంలోని గౌరవరం గ్రామంలో ఆదివారం యాకోబు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కి గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో యాకోబు మృతదేహాన్ని పరిశీలించి నివాళులర్పించారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వర్షాకాలం సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News October 8, 2024
విజయవాడ: 16 మంది వైసీపీ అభ్యర్థులు ఏమయ్యారు?
విజయవాడ పార్టీ కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు YCP నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు. కానీ వరదల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన 16 మంది అభ్యర్థులు ఏమైపోయారో తెలియదన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న సింగ్ నగర్, జక్కంపూడి ప్రాంతాల్లో కూడా వైసీపీ నాయకులు పర్యటించలేదని విమర్శించారు.
News October 8, 2024
విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం
విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం జరిగింది. రాజస్థాన్లోని అజ్మేర్లో ఆగి ఉన్న ట్రక్కును వీరి బస్సు ఢీకొనగా.. ఒకరు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 11మంది గాయపడ్డారు. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఘటన జరగ్గా.. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజయవాడ నుంచి 80మంది స్టడీ టూర్ కోసం వెళ్లినట్లు సమాచారం.
News October 8, 2024
అవనిగడ్డలో జాబ్ మేళా.. రూ.18వేల వరకు వేతనం
అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్ బాబు తెలిపారు. జాబ్ మేళాకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18- 29 ఏళ్లలోపువారు హాజరు అవ్వొచ్చన్నారు. ఇందులో పలు ప్రముఖ కంపెనీలు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, ఎంపికైన వారికి రూ.10- 18 వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారని విక్టర్ బాబు చెప్పారు.