News June 30, 2024

BREAKING: రేపు టెట్ నోటిఫికేషన్

image

AP: జులై 1న టెట్ <<13539471>>నోటిఫికేషన్<<>> విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ వెల్లడించారు. జులై 2 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తితో మరోసారి టెట్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. https://cse.ap.gov.in/ వెబ్‌సైటులో టెట్ పరీక్ష వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు.

Similar News

News January 15, 2026

సంక్రాంతికి అరిసెలు ఎందుకు చేస్తారు?

image

సంక్రాంతి పంటల పండుగ కాబట్టి కొత్తగా చేతికి వచ్చిన బియ్యం, బెల్లం, నువ్వులSతో అరిసెలు చేస్తారు. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, శక్తిని, ఐరన్‌ను ఈ పదార్థాలు అందిస్తాయి. అరిసెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల, పండుగకు వచ్చే అతిథులకు, అత్తారింటికి వెళ్లే అల్లుళ్లకు వీటిని ప్రేమపూర్వకంగా ఇస్తుంటారు. సంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు, పండుగలకు అరిసెను ఒక సంపూర్ణమైన, మంగళకరమైన పిండివంటగా భావిస్తారు.

News January 15, 2026

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఝార్ఖండ్‌లో ఉద్యోగాలు

image

<>సెంట్రల్ <<>>యూనివర్సిటీ ఆఫ్ ఝార్ఖండ్‌ 14 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు జనవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ME, MTech, MS, PhD, NET/SET/SLET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జనవరి 21నుంచి 24 వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.57,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://cuj.ac.in/

News January 15, 2026

పండుగ వేళ ఖాతాల్లోకి డబ్బులు

image

AP: సంక్రాంతి వేళ ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో డబ్బులు జమవుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న DA, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవుల మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5.70లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని ఆర్థిక శాఖ చెబుతోంది. ఒక్కో ఉద్యోగికి రూ.70వేల నుంచి రూ.80వేల వరకు అకౌంట్లో పడుతున్నట్లు సమాచారం. పలువురు కాంట్రాక్టర్లకూ పెండింగ్‌ బిల్లులు రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.