News June 30, 2024
ఒక్క మ్యాచ్ ఓడకుండా ప్రపంచకప్.. తొలి టీమ్గా భారత్ రికార్డు
T20WC టోర్నీ మొత్తం ఒక్క మ్యాచ్ ఓడకుండా ప్రపంచకప్ సాధించిన తొలి టీమ్గా భారత్ చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో ఐర్లాండ్, పాక్, USA, సూపర్-8లో అఫ్గాన్, బంగ్లా, ఆసీస్, సెమీస్లో ఇంగ్లండ్, ఫైనల్లో సౌతాఫ్రికాను IND ఓడించింది. T20WC ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసి రెండు సార్లు(2007, 2024) కప్ సాధించిన ఏకైక జట్టుగానూ భారత్ నిలిచింది. మిగతా 6 సందర్భాల్లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే విజేతలు.
Similar News
News September 20, 2024
దేవర తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమాలివే
‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ ఏయే సినిమాల్లో నటిస్తారోనన్న ఆసక్తి ఫ్యాన్స్లో నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తర్వాతి మూవీల లైనప్ గురించి తారక్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రకారం.. వచ్చే నెల 21 నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. జనవరిలో ఆ సినిమా షూటింగ్లో తారక్ జాయిన్ అవుతారు. ఆలోపు హృతిక్ రోషన్తో ‘వార్ 2’ పూర్తి చేస్తారు. నీల్తో సినిమా షూట్ అనంతరం దేవర పార్ట్-2 షూట్ చేస్తారు.
News September 20, 2024
సెప్టెంబర్ 20: చరిత్రలో ఈ రోజు
✒ 1924: ప్రముఖ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జననం
✒ 1933: హోంరూల్ ఉద్యమ నేత అనీ బిసెంట్ మరణం
✒ 1949: బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ పుట్టినరోజు
✒ 1954: ప్రముఖ కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం జననం
✒ 1999: తమిళ నటి టి.ఆర్.రాజకుమారి మరణం
✒ రైల్వే భద్రతా దళ(RPF) వ్యవస్థాపక దినోత్సవం
News September 20, 2024
నేను రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని: మహేశ్కుమార్ గౌడ్
TG: దేశంలోని SC, ST, BC, మైనార్టీలకు న్యాయం జరగాలని పోరాడుతున్న మహానుభావుడు రాహుల్ గాంధీ అని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. అందుకే ఆయన్ను చంపుతామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను రాహుల్ వదలిన బీసీ బాణాన్ని అని చెప్పారు. కులగణన చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 42 నుంచి 23 శాతం తగ్గించిందని దుయ్యబట్టారు.