News June 30, 2024
వసీం అక్రమ్ కంటే బుమ్రా వెరీ స్పెషల్: మైఖేల్ వాన్

నిత్యం టీమ్ ఇండియాపై విమర్శలు చేసే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. తొలిసారి బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న భారత్ T20WCను గెలిచిన తర్వాత మాట్లాడుతూ.. ‘పాక్ దిగ్గజం వసీం అక్రమ్ ప్రత్యేకమైన బౌలరే. కానీ అతడి కంటే బుమ్రా వెరీ స్పెషల్. ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. తెలివిగా బౌలింగ్ చేస్తున్నారు. అతడి స్లో డెలివరీ బాల్ నిజంగా సూపర్’ అని పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<