News June 30, 2024
అరకు కాఫీపై మోదీ, చంద్రబాబు ముచ్చట్లు.. మధ్యలో జైరాం రమేశ్

అరకు కాఫీపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు Xలో ముచ్చట్లు <<13539131>>చెప్పుకోగా<<>>, ఈ అంశంలో INC నేత జైరాం రమేశ్ ఎంట్రీ ఇచ్చారు. ‘అరకు కాఫీ బ్రాండ్ను తానే కనిపెట్టినట్లుగా మోదీ ఎప్పటిలాగే అతిశయోక్తితో మాట్లాడారు. నిజానికి అరకులో కాఫీ సాగుకు నాంది వేసింది UPA ప్రభుత్వం. వాణిజ్య మంత్రిగా 2007 DEC 21న నేనే ప్రారంభించా. ఐదేళ్ల తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను అక్కడ మళ్లీ పర్యటించా’ అని గుర్తు చేసుకున్నారు.
Similar News
News November 9, 2025
PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<
News November 9, 2025
జూబ్లీ‘హిట్’ అయ్యేదెవరో?

హాట్ సీటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది దశకు చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దివంగత MLA మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ ఇచ్చిన BRS సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న INC నవీన్ యాదవ్ గెలుపునకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అటు జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగురవేస్తామని BJP చెబుతోంది. మీ కామెంట్?
News November 9, 2025
15L టన్నుల చక్కెర ఎగుమతికి గ్రీన్సిగ్నల్?

2025-26లో 15L టన్నుల చక్కెర ఎగుమతులను అనుమతించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొలాసిస్(చక్కెర తయారీలో ఏర్పడే ద్రవం)పై 50% ఎగుమతి సుంకాన్ని ఎత్తేస్తుందని సమాచారం. దీనివల్ల మిల్లులకు లాభాలు, రైతులకు వేగంగా చెల్లింపులు జరుగుతాయని భావిస్తోంది. వచ్చే సీజన్లో చక్కెర ఉత్పత్తి 18.5% పెరిగి 30.95M టన్నులకు చేరుతుందని అంచనా. ఇథనాల్ ఉత్పత్తికి 34L టన్నులు వినియోగించినా భారీగా మిగులు ఉండనుంది.


