News July 1, 2024
ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం భారత్లో ఏర్పాటు: కేంద్రమంత్రి
ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంను వచ్చే ఏడాది భారత్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఇది ఫ్రాన్స్లోని లౌవ్రె మ్యూజియం కన్నా రెండింతలు పెద్దగా ఉంటుందని చెప్పారు. ఇదే విషయమై ఫ్రాన్స్తో ఒప్పందం జరిగిందని జోధ్పుర్లో మీడియాతో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్టులో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 21, 2024
ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికలపై పోరాడాలి: సీఎం రేవంత్
TG: సీతారాం ఏచూరిని కోల్పోవడం సమాజానికి తీరని నష్టం అని సీఎం రేవంత్ అన్నారు. HYDలో జరిగిన ఏచూరి సంస్మరణ సభలో మాట్లాడుతూ ‘జమిలి ఎన్నికల ముసుగులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర చేస్తోంది. దేశాన్ని కబళించాలని చూస్తోంది. సీతారాం ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికల అంశంపై పోరాడాలి. ఈ సమయంలో ఆయన లేకపోవడం దేశానికి నష్టం’ అని వ్యాఖ్యానించారు.
News September 21, 2024
జగన్ పాలనలో అనేక దుస్సాహసాలు జరిగాయి: CM చంద్రబాబు
AP: గత ప్రభుత్వం వల్ల తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని CM చంద్రబాబు అన్నారు. ‘లడ్డూ అపవిత్రం కావడంపై లోతుగా విచారణ జరగాలి. రూ.320కే కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది? జగన్ పాలనలో అనేక దుస్సాహసాలు జరిగాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశారు. అన్ని దేవాలయాల్లో తనిఖీలు చేస్తున్నాం. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై పండితులతో చర్చిస్తున్నాం’ అని మీడియాతో చిట్ చాట్లో వ్యాఖ్యానించారు.
News September 21, 2024
కారు యాక్సిడెంట్.. ICUలో నటుడు
బాలీవుడ్ నటుడు పర్విన్ దాబాస్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముంబైలో ఈ ఉదయం అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పర్విన్ ‘మాన్సూన్ వెడ్డింగ్’, ‘మైనే గాంధీ కో నహీ మారా’, ‘ది పర్ఫెక్ట్ హజ్బెండ్’ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ లాంటి సినిమాల్లో నటించారు. ‘తమ్ముడు’ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రీతి జింగ్యానీని పర్విన్ 2008లో పెళ్లి చేసుకున్నారు.