News July 1, 2024

డిప్యూటీ తహశీల్దార్ల చేతికి ధరణి రిజిస్ట్రేషన్లు?

image

TG: భూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచేలా ప్రభుత్వం కీలక సంస్కరణలు తేనున్నట్లు తెలుస్తోంది. ధరణి రిజిస్ట్రేషన్ల బాధ్యతలతో తహశీల్దార్ల సమయమంతా అక్కడే గడిచిపోతోంది. దీంతో ఆ బాధ్యతల్ని డిప్యూటీ తహశీల్దార్లకు ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. తహశీల్దార్లకు కార్యాలయ నిర్వహణ, భూ సమస్యల పరిష్కారం వంటి ఇతర విధులు ఇవ్వాలని భావిస్తోందట. తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 21, 2024

విష్ణు ట్వీట్‌కు స్పందించిన ప్రకాశ్ రాజ్

image

మంచు విష్ణు తనకిచ్చిన కౌంటర్‌పై ప్రకాశ్ రాజ్ స్పందించారు. విష్ణు కన్నప్ప సినిమా టీజర్‌లోని ఆఖరి డైలాగ్‌ను హేళన చేస్తూ ట్వీట్ చేశారు. ‘ఓకే శివయ్యా.. నాకు నా దృక్కోణం ఉంటే మీకు మీ ఆలోచన ఉంటుంది. నోటెడ్’ అని ట్వీట్ చేశారు. దానికి జస్ట్ ఆస్కింగ్ అని హాష్ ట్యాగ్ ఇచ్చారు. విష్ణు, ప్రకాశ్ ఇద్దరూ మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడిన సంగతి తెలిసిందే.

News September 21, 2024

ఇంటెల్ కంపెనీని కొంటున్న క్వాల్‌కామ్!

image

ఇంటెల్‌ను టేకోవర్ చేయాలని క్వాల్‌కామ్ భావిస్తోందని తెలిసింది. ఇప్పటికే దాన్ని సంప్రదించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. నియంత్రణ సంస్థల ఆమోదం లభించి ఈ డీల్ పూర్తవ్వడానికి చాలా కాలమే పట్టొచ్చని అంచనా. ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లను ఉత్పత్తి చేసే క్వాల్‌కామ్ ఈ మధ్యే పీసీ ప్రాసెసర్ల రంగంలోకి ఎంటరైంది. ఇక $1.6 బిలియన్ల లాస్‌లో ఉన్న ఇంటెల్ షేర్లు 2024లో 60% క్రాష్ అయ్యాయి.

News September 21, 2024

ఈ 7 అలవాట్లతో పిల్లల ఆరోగ్యానికి ముప్పు

image

కొన్ని అలవాట్లు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవి 1.గోర్లు కొరకడం. దీని వల్ల బ్యాక్టీరియా కడుపులోకి వెళుతుంది. 2.తినేటప్పుడు TV/ఫోన్ చూడటం. 3.ఎక్కువగా హెడ్‌ఫోన్స్ వాడటం. 4.నిద్రపోయే ముందు ఫోన్ చూడటం. 5.బెడ్‌పై పడుకొని తినడం. ఇలా తింటే జీర్ణక్రియ సరిగా జరగదు. 6.పళ్లు కొరకడం. దీని వల్ల సెన్సిటివిటీ, దవడ నొప్పి వస్తుంది. 7.పికీ ఈటింగ్‌. దీని వల్ల పోషకాలున్న ఆహారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.