News July 1, 2024
కర్నూలు: నేటి నుంచి బియ్యం, జొన్నల పంపిణీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719794049464-normal-WIFI.webp)
నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని గోదాముల్లో తూనికలు, కొలతలశాఖ అధికారులు సరకుల నాణ్యత పరిశీలించి నివేదికలు ఇవ్వనున్నారని JC నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జులై నెలకు సంబంధించి కార్డుదారులకు బియ్యం, జొన్నలు మాత్రమే పంపిణీ చేయాలని ఉత్తర్వులు వచ్చినట్లు చెప్పారు. కార్డుదారులు 3 కిలోల వరకు జొన్నలను బియ్యానికి బదులుగా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.
Similar News
News July 5, 2024
రేపు జడ్పీ సమావేశం.. ఎమ్మెల్యేలకు అందని సమాచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720150461523-normal-WIFI.webp)
కర్నూలులో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రేపు నిర్వహించేందుకు పాలకవర్గం సిద్ధమైంది. ఈ సమావేశాలకు ఇప్పటికీ ఎమ్మెల్యేలకు సమాచారం అందకపోవడం గమనార్హం. జడ్పీ పాలక వర్గంలో ఛైర్మన్తో పాటు 52 మంది జడ్పీటీసీ సభ్యులు వైసీపీకి చెందిన వారే. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది గెలిచారు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు లేకుండా జడ్పీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.
News July 5, 2024
కర్నూల్: ‘ఉపాధి’లో 78 మందికి షోకాజ్ నోటీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720141354853-normal-WIFI.webp)
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లక్ష్యాలను సాధించడంలో అలసత్వం వహించిన 78 మంది ఉపాధి అధికారులు, సిబ్బందికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లు, 10 మండలాల ఏపీవోలు, ఈసీలు, దాదాపు అన్ని మండలాల్లోని పలువురు సాంకేతిక సహాయకులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
News July 5, 2024
డా.సుధాకర్పై పోక్సో కేసు నమోదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720142399249-normal-WIFI.webp)
బాలికపై లైంగిక వేధింపుల కేసులో కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 376తో పాటు బాధితురాలు మైనర్ కావడంతో పోక్సో చట్టం సెక్షన్ 6 రెడ్విత్ 5(ఎల్) కింద కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుధాకర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జిల్లా కారాగారానికి తరలించారు.