News July 1, 2024

పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కుమార్తెకు ఉత్తమ కలెక్టర్ అవార్డు

image

పాతపట్నం మాజీ MLA రెడ్డి శాంతి కుమార్తె రెడ్డి వేదిత (ఐఎఎస్) ఆదివారం ఉత్తమ కలెక్టర్ అవార్డును అందుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ పట్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పక్కాగా అమలు చేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్) సూచీల ఆధారంగా ఈ అవార్డును అందజేశారు.

Similar News

News July 5, 2024

అమరావతి కోసం తొలి వేతనాన్ని విరాళంగా ఇచ్చిన ఎంపీ కలిశెట్టి

image

అమరావతి అభివృద్ధి కోసం ఎంపీగా అందుకొన్న తొలి గౌరవ వేతనాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును నేడు ఎంపీ కలిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రూ.1.57 లక్షల చెక్కును ఆయన చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఎంపీని సీఎం అభినందించారు.

News July 5, 2024

శ్రీకాకుళం: గడ్డి మందు తాగి మహిళ మృతి

image

పాలకొండకు చెందిన వివాహిత మాధవి(42) గురువారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గారమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె గత రాత్రి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News July 5, 2024

నేడు విశాఖ-గుణుపురం రైలు రద్దు

image

విశాఖ-గుణుపురం మధ్య నడుస్తున్న రైలును శక్రవారం రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. పూండి- నౌపడ మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా రైలును రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.