News July 1, 2024
ప.గో.: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని సూసైడ్

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. భీమవరం రూరల్ స్టేషన్ రైటర్ మహేశ్ తెలిపిన వివరాలు.. భీమవరం మండలం యమునేపల్లికి చెందిన బుంగా చందు(23) ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు ఇటీవల వేరే వ్యక్తితో పెళ్లి కుదరడంతో మనస్తాపంతో చందు శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పాతపాడు వద్ద ఉప్పుటేరులో ఆదివారం మృతదేహం లభ్యమైంది. సూసైడ్ చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు.
Similar News
News November 8, 2025
భీమవరం: భక్త కనకదాసు జయంతి

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు శ్రీ భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త అని అన్నారు.
News November 8, 2025
ఈ నెల 12న జిల్లాలో వైసీపీ నిరసన ర్యాలీలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతున్నామని వైసీపీ పార్లమెంట్ అబ్జర్వర్ మురళీ కృష్ణంరాజు, భీమవరం ఇన్ఛార్జి వెంకట్రాయుడు తెలిపారు. శనివారం రాయలంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నెల రోజులుగా సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతోందని, దానిలో భాగంగా 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
News November 8, 2025
పాలకొల్లు: నీళ్లనుకుని కలుపుమందు తాగి వ్యక్తి మృతి

పాలకొల్లు బ్రాడీపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ పాలూరి రమేశ్ (46) మృతి చెందాడు. ఈ నెల 4న విధులకు వెళ్తూ పొరపాటున మంచినీళ్ల సీసాకు బదులు కలుపుమందు సీసాను తీసుకెళ్లారు. మార్గమధ్యంలో నీళ్లు అనుకుని దానిని తాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.


