News July 1, 2024
సంగారెడ్డి: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719797897321-normal-WIFI.webp)
పద్మ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తూ హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. www.padmaawards. gov.inలో జూలై 31లోగా ఆసక్తి ఉన్న జిల్లాకు చెందిన వారు డీఐవో ఎన్ఐసీ ద్వారా సంబంధిత హెచ్ఐ్వడీలకు నామినేషన్లను సమర్పించాలని సూచించారు.
Similar News
News July 5, 2024
మెదక్: సదరం క్యాంప్ తేదీలు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720164558003-normal-WIFI.webp)
మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగులను గుర్తించి అర్హతగల వారికి సదరం ధ్రువీకరణ పత్రం పొందేందుకుగానూ జులై -2024 సంబందించిన క్యాంప్ తేదీలను మీ సేవ / ఈ సేవ కేంద్రాలకు కేటాయించినట్లు డీఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. దివ్యాంగులు తమ దగ్గరలో ఉన్న మీ సేవ/ ఈ సేవ కేంద్రం వద్ద ఆన్ లైన్లో స్లాటు బుక్ చేసుకొని కేటాయించిన రోజు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
News July 5, 2024
ప్రజల్లో చైతన్యం నింపడంలో కవులు, రచయితలు ముందుండాలి: KCR
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720147778822-normal-WIFI.webp)
తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, MLC గోరేటి వెంకన్న ఎర్రవెల్లి ఫాంహౌజ్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలన్నారు.
News July 5, 2024
సిద్దిపేట: తల్లిని చంపి సహజ మరణంగా..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720152092898-normal-WIFI.webp)
కొడుకు తల్లిని చంపి సహజ మరణంగా చిత్రీకరించాడు. పోలీసుల వివరాలు.. HYDకి చెందిన బాలకృష్ణమ్మ(54) కొడుకు సర్వేశ్, పక్కింటివారితో కలిసి నాచారంగుట్ట క్షేత్రానికి వచ్చింది. రాత్రి ఆమె అస్వస్థతకు గురి కాగా కొడుకు అసహనంతో తల్లి తలను నేలకేసి కొట్టడంతో స్పాట్లోనే చనిపోయింది. సహజ మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంట వెళ్లిన వారి ద్వారా అసలు విషయం తెలుసుకుని ఆమె కుమార్తె సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.