News July 1, 2024
KNR స్మార్ట్సిటీ పనుల పూర్తికి అవకాశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719800708017-normal-WIFI.webp)
స్మార్ట్సిటీ మిషన్ పనుల గడువును వచ్చే మార్చివరకు పొడిగించడంతో KNRలోని పెండింగ్ పనుల పూర్తికి అవకాశముంది. KNR స్మార్ట్సిటీ కార్పొరేషన్ పరిధిలో రూ.647.32కోట్లతో చేపట్టిన 22 ప్రాజెక్టుల పనులు పూర్తి కాగా.. మరో 23 ప్రాజెక్టులకు రూ.259.79 కోట్లను కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేటాయించింది. దీంతో రహదారులు, మురుగుకాలువలు, ట్రాఫిక్ సిగ్నల్స్, కమాండ్ కంట్రోల్ తదితర పనులు అందుబాటులోకి వచ్చాయి.
Similar News
News July 5, 2024
కరీంనగర్: జలపాతం వద్ద తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720158166744-normal-WIFI.webp)
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్కు చెందిన సంపత్, మన్నెంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గురువారం జలపాతాన్ని చూసేందుకు వెళ్లగా.. తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పృహ తప్పి పడిపోయారు. వారికి గాయాలు కావడంతో గ్రామస్థులు 108 ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News July 5, 2024
జమ్మికుంట: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720152563053-normal-WIFI.webp)
జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్కు చెందిన జీడి కావ్య (28) ఆత్మహత్య చేసుకున్నట్లు CI రవి తెలిపారు. CI వివరాలు.. వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన జీడి రాజుతో 12 ఏళ్ల క్రితం కావ్య వివాహం జరిగింది. కొన్ని రోజులుగా భార్య కావ్యను అనుమానంతో భర్త రాజు వేధించాడు. దీంతో బుధవారం రాత్రి ఇంట్లో కావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కావ్య తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News July 5, 2024
KNR: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720144821589-normal-WIFI.webp)
బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన HYD శివారులో జరిగింది. నార్సింగి SI ప్రభాకర్ వివరాలు.. భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన మోహన్ గండిపేటలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో డ్రైవర్గా పనిచేస్తూ పీరంచెరువు భవాని కాలనీలో నివాసముంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సందీప్ (21) ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి సందీప్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.