News July 1, 2024
తూ.గో.: పవన్ కళ్యాణ్ ENTRY
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719804610787-normal-WIFI.webp)
డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా పిఠాపురం నియోజకవర్గానికి బయలుదేరారు. గొల్లప్రోలు మండలంలో ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.
Similar News
News July 5, 2024
రేపు CMల భేటీ.. తెరపైకి ఆ 5 గ్రామ పంచాయతీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720151741615-normal-WIFI.webp)
తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు HYDలో శనివారం భేటీ కానున్నారు. ప్రస్తుతం భద్రాచలం మండలంలో భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మిగిలినవి AP పరిధిలో ఉన్నాయి. ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. రేపు ఇద్దరు CMల భేటీ నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరుగుతుందా..? అనే ఉత్కంఠ నెలకొంది.
News July 5, 2024
మార్గాని భరత్ ప్రచారరథం దహనం కేసులో వ్యక్తి అరెస్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720134979104-normal-WIFI.webp)
రాజమండ్రిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచారరథం దహనం కేసులో వీఎల్ పురానికి చెందిన దంగేటి శివాజీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తూర్పు మండల డీఎస్పీ కిషోర్ గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడిని రిమాండ్ కోసం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
News July 5, 2024
పవన్ కళ్యాణ్ ఎవరి వద్ద స్థలం కొన్నారో తెలుసా..?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720140333005-normal-WIFI.webp)
పిఠాపురంలో భూమి కొన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఉప్పాడ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థలం ఎక్కడ..? ధరెంత..? ఎవరి వద్ద కొన్నారనే ఆసక్తి నెలకొంది. పిఠాపురం-గొల్లప్రోలు టోల్ప్లాజా పక్కన 3.52 ఎకరాల వ్యవసాయ భూమిని పవన్ కొన్నారు. దీని మార్కెట్ విలువ రూ.50,05,000. కాకినాడలోని శాంతినగర్కు చెందిన కోన శ్రీనందు వద్ద కొనుగోలు చేసిన ఆ భూమిలో ఇంటితో పాటు పార్టీ ఆఫీస్ నిర్మించనున్నారు.