News July 1, 2024

కదిరిలో మహిళపై అత్యాచారయత్నం

image

కదిరి మండలంలోని ఓ గ్రామంలో మహిళపై అత్యాచారయత్నం జరిగిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన భాను ప్రతాప్ రెడ్డి అదే గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై శనివారం రాత్రి అత్యాచారయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలు భర్తతో కలిసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్ తెలిపారు.

Similar News

News July 5, 2024

కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన పయ్యావుల

image

ఢిల్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బిజీబిజీగా గడుపుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన వివిధ శాఖల మంత్రులను కలుస్తున్నారు. ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై మెమోరాండాన్ని అందజేశారు. ఏపీకి నిధుల కేటాయింపు గురించి చర్చించారు.

News July 5, 2024

బ్రహ్మోత్సవాలకు రండి.. మంత్రి సవితకు శ్రావణి ఆహ్వానం

image

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కలిశారు. పెనుకొండలో కలిసిన ఆమె గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బీసీ వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని కోరారు. ఈ మేరకు పలు అంశాలపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు.

News July 5, 2024

అనంతపురం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

image

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో దారుణ హత్య జరిగింది. నల్ల దాసరి పల్లి గ్రామంలో బోయ ఆవుల లక్ష్మన్న (48) అనే వ్యక్తి ఇవాళ తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.