News July 1, 2024

శ్రీకాకుళం: పింఛన్ల పంపిణీ పై ఆరా తీసిన జిల్లా కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆన్‌లైన్‌లో పరిశీలించారు. సోమవారం ఉదయం స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారో పరిశీలించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పింఛను అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి రోజే శత శాతం పూర్తి కావాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

Similar News

News July 5, 2024

అమరావతి కోసం తొలి వేతనాన్ని విరాళంగా ఇచ్చిన ఎంపీ కలిశెట్టి

image

అమరావతి అభివృద్ధి కోసం ఎంపీగా అందుకొన్న తొలి గౌరవ వేతనాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును నేడు ఎంపీ కలిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రూ.1.57 లక్షల చెక్కును ఆయన చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఎంపీని సీఎం అభినందించారు.

News July 5, 2024

శ్రీకాకుళం: గడ్డి మందు తాగి మహిళ మృతి

image

పాలకొండకు చెందిన వివాహిత మాధవి(42) గురువారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గారమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె గత రాత్రి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News July 5, 2024

నేడు విశాఖ-గుణుపురం రైలు రద్దు

image

విశాఖ-గుణుపురం మధ్య నడుస్తున్న రైలును శక్రవారం రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. పూండి- నౌపడ మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా రైలును రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.