News July 1, 2024
NLG: జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719798666251-normal-WIFI.webp)
నల్గొండ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలం షురూ కాకముందే డెంగీ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడం డెంగీ వ్యాప్తి ఉధృతికి అద్దం పడుతోంది. నల్గొండ నియోజకవర్గంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News July 5, 2024
నల్లగొండ: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు 10% రాయితీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720159387467-normal-WIFI.webp)
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధి నుంచి తిరుపతి వెళ్లే భక్తులు సూపర్ లగ్జరీ బస్సులలో అప్ అండ్ డౌన్ ఒకే సారి రిజర్వేషన్ చేయించుకుంటే బస్ ఛార్జీల నుంచి పది శాతం రాయితీనీ పొందవచ్చని ఉమ్మడి నల్లగొండ రీజినల్ మేనేజర్ యం. రాజశేఖర్ తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News July 5, 2024
నల్లగొండ: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు 10% రాయితీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720159387467-normal-WIFI.webp)
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధి నుంచి తిరుపతి వెళ్లే భక్తులు సూపర్ లగ్జరీ బస్సులలో అప్ అండ్ డౌన్ ఒకే సారి రిజర్వేషన్ చేయించుకుంటే బస్ ఛార్జీల నుంచి పది శాతం రాయితీనీ పొందవచ్చని ఉమ్మడి నల్లగొండ రీజినల్ మేనేజర్ యం. రాజశేఖర్ తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News July 5, 2024
నల్గొండ: ప్రాణాలు తీస్తున్న కరెంటు తీగలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720150722698-normal-WIFI.webp)
కరెంటు తీగలు మనుషులు, పశువుల ప్రాణాలు తీస్తున్నాయి. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు ఏడాదిలోనే 43 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 65 మూగజీవాలు చనిపోయాయి. జిల్లా అధికారుల లెక్క ప్రకారం గాయపడిన వారి సంఖ్య తక్కువగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ ఉద్యోగుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.