News July 1, 2024

మిషన్ పూర్తైంది: బీసీసీఐ

image

వరల్డ్ కప్ సాధించాలనే మిషన్ పూర్తయినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘బిలియన్ల మంది అభిమానుల భావోద్వేగాలు, చిరునవ్వులు, కలలతో కూడుకున్న T20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నాం. ప్రపంచ విజేతలుగా నిలిచాం. కెప్టెన్.. మీరు సాధించారు’ అంటూ టీ20 WC ట్రోఫీతో రోహిత్ దిగిన ఫొటోలను పంచుకుంది.

Similar News

News July 5, 2024

టీడీపీలో చేరిన చిత్తూరు మేయర్, డిప్యూటీ మేయర్

image

AP: చిత్తూరులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నగర మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేశ్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నుంచి 46 మంది, టీడీపీ నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్‌గా ఒకరు గెలిచారు. ప్రస్తుత చేరికలతో సంఖ్యా బలం మారుతోంది.

News July 5, 2024

నీట్ పీజీ పరీక్ష తేదీ ప్రకటన

image

నీట్ పీజీ 2024 పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్లు NBEMS ప్రకటించింది. రెండు షిప్టుల్లో పరీక్ష జరుగుతుందని, పూర్తి వివరాలకు https://natboard.edu.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది. నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా వివాదం నెలకొనడంతో గత నెల 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

News July 5, 2024

బ్లాక్ బస్టర్ మూవీకి ప్రీక్వెల్ రాబోతోంది

image

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ‘బింబిసార’ సినిమా గురించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్‌ ఉంటుందని ప్రకటించారు. బింబిసారుడి కంటే ముందు త్రిగర్తలా రాజ్యాన్ని పాలించింది ఎవరు? ఏం జరిగిందనేది ఇందులో చూపించనున్నట్టు వెల్లడించారు. ‘బింబిసార’ను మల్లిడి వశిష్ఠ తెరకెక్కించగా ప్రీక్వెల్‌కు అనిల్ పాడూరి దర్శకత్వం వహించనున్నట్టు తెలిపారు.